క్రోధం అనే అంతశ్శత్రువు మనల్ని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ మనం నిదానంగానే ఉండాలి. ఆవేశపడితే ఆత్మ నశిస్తుంది- అని హెచ్చరిస్తోంది మహాభారతం. ఎంతటి మహాజ్ఞానులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఉదాహరణకు బ్రహ్మర్షి కావడానికి ముందు విశ్వామిత్రుడు క్షత్రియుడు. తన కోపం కారణంగా ఆయన ఎన్నో కష్టాలు కొనితెచ్చుకున్న ఉదంతాలను పురాణాలు పేర్కొన్నాయి. వశిష్టుడి వద్దనున్న మహిమాన్వితమైన హోమధేనువును తనకు ఇవ్వమని విశ్వామిత్రుడు అడిగితే- నిరాకరించాడు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించి, ఆ గోవును బలవంతంగా తరలించుకుని రమ్మని సైన్యాన్ని పంపాడు. అప్పుడు ఆ హోమధేనువు నుంచి సైన్యం పుట్టుకొచ్చి, విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడించింది. వశిష్టుడి మహిమలకు అతడి తపశ్శక్తే కారణమని గ్రహించాడు విశ్వామిత్రుడు. రాజ్యాన్ని వదిలి తపస్సు ఆరంభించాడు. వశిష్టుడిలా తను కూడా ‘బ్రహ్మ’ అనిపించుకోవాలని తపిస్తుంటాడు. కానీ.. ‘కోపాన్ని త్యజించినవాడే బ్రహ్మర్షి అవుతాడు’ అని వశిష్టుడు వివరించడంతో.. విశ్వామిత్రుడికి జ్ఞానోదయం అయ్యింది. కోపద్వేషాలు లేని నిర్మలమైన ప్రేమే శాంతిని చేకూరుస్తుంది. అందరికీ దగ్గర చేస్తుంది. ప్రేమమూర్తులకు శత్రువులు ఉండరు. అలాంటి అజాత శత్రువులను ఆదరించి, అక్కున చేకూర్చుకుంటారు.
43
You Might Also Like
జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం
12
రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయానికి గొప్ప విశిష్టత లభించింది. జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక...
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
15
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి...
యోగి సాహెబ్ రామ్ రామ్… ఆసక్తికర విషయం వెల్లడించిన సీఎం
17
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన...
దుర్గాపూజలకు మరింత బందోబస్తు
14
భారత్లోని పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న...
‘గోవు ఘోషను విను గోవిందా’ కార్యక్రమం
26
రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ‘గోవు ఘోషను విను గోవిందా’ కింద పేరిట ఆదివారం గోమాత పూజలు చేపట్టనున్నట్లు భాజపా కిసాన్మోర్చా ప్రకటించింది. దేవాలయాలను గోపంచకంతో శుద్ధిచేస్తామని అధ్యక్షుడు...
అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు : టీటీడీ
26
అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక...