ఉత్తర్ప్రదేశ్లో కావడి యాత్రా మార్గం వెంబడి ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలంటూ ముజఫర్నగర్ జిల్లా అధికారులు జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్రమంతటికీ వర్తింపజేయాలని శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్, బిహార్లకు కావిళ్లతో వెళ్లి గంగాజలం తీసుకొని స్వస్థలాలకు వస్తారు. ఆ జలంతో స్థానిక శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు. ఈ కావడి మార్గం ఒక్క ముజఫర్నగర్ జిల్లాలోనే 240 కిలోమీటర్ల పర్యంతం సాగుతుంది. కాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కావడి మార్గంలో యూపీ తీసుకొచ్చిన ఆంక్షలను జులై 12 నుంచే అమలు చేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. యూపీ సర్కారు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కావడి యాత్ర వెంబడి ఉన్న అన్ని మార్గాల్లో ఈ ఆంక్షలను అమలుచేసేలా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఉపవాసంతో కావడి యాత్ర చేసే భక్తులు శుద్ధ శాకాహారం, సాత్వికాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోడానికి వీలుగా ఈ ఆజ్ఞలను జారీ చేశామని అధికారులు చెబుతున్నారు.
57
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
46
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
28
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
36
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
29
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
45
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...