సరైన రహదారి నోచుకోని గిరిజన గ్రామాలకు మంచి రోజులు రాబోతున్నాయి. కచ్చా రోడ్ల స్థానంలో తారు రోడ్లు నిర్మించనున్నారు. ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో తొలి దశలో 6 జిల్లాల్లో పనులు చేపట్టనున్నారు. 149 గిరిజన ఆవాస ప్రాంతాల్లో రూ. 280.53 కోట్లతో 130 మార్గాలు బాగుపడనున్నాయి. అంచనా వ్యయంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూర్చనున్నాయి. త్వరలో టెండర్లు పిలవనున్నారు. గత వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు లేక గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీలు కట్టుకొని కొండలు, గుట్టలు దాటాల్సి వచ్చింది. ఇలాంటి అవస్థలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్’ పథకాన్ని గతేడాది నవంబరులో ప్రారంభించింది. రాష్ట్రంలో వందకిపైగా జనాభా కలిగిన 130 ఆవాసాల్లో తొలి దశలో 130 రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.115.72 కోట్లు సమకూర్చనుంది. రెండో దశలో మరో 122 ఆవాస ప్రాంతాల్లో పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.
77
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
22
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
18
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
25
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
11
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
19
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
22
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...