News

ఇంద్రకీలాద్రిలో ముగిసిన వారాహి నవరాత్రులు

49views

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని రుద్రహోమం యాగశాలలో ఈనెల 6 నుంచి ప్రారంభమైన వారాహీ నవరాత్రి పూజలు సోమవారంతో ముగిశాయి. దీనికి సంబంధించి యాగశాలలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు నడుమ జరిగిన పూర్ణాహుతిలో ఈవో రామారావు దంపతులు, స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతికి ముందు ప్రత్యేక అర్చనలు చేసి కలశ ఉద్వాసన చేశారు. అనంతరం ఆశీస్సులు అందచేశారు. వారాహీ నవరాత్రుల ప్రత్యేకతలను గురించి స్థానాచార్యుడు వివరించారు. యజ్ఞనారాయణ, శ్రీనివాసఽశాస్త్రి పు రాణపండిట్‌ వెంకటేశ్వరరావు పూజాదికాలను గురించి వివరించారు. అనంతరం ఈవో దం పతులు అర్చక సత్కారం చేసి దక్షిణ తాంబూలాలను అందజేశారు.