భూమిపైన ఉన్నట్టుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పలువురు చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందించారు. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజినీరింగ్కు చెందిన బృందం చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చంద్రుడి అణువణువూ తెలుసుకునేలా ఈ నావిగేషన్ వ్యవస్థ పని చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నాలుగు కక్ష్యల్లో, మూడు దఫాల్లో ఈ ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది సుస్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రతిపాదన అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు చైనీస్ స్పేస్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. చంద్రుడిపై పరిశోధనలకు గానూ చైనా లక్ష్యాలకు ఈ నావిగేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ప్రస్తుతం భూమిపై అమెరికాకు చెందిన జీపీఎస్ ఉన్నట్టుగానే, చైనాకు సైతం బీదౌ పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థ ఉంది.