తెలుగు భాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని సహజ సాహితీ సంస్థ వ్యవస్థాపకుడు, కవి వడలి రాధాకృష్ణ అన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో సహజ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విద్యా కాలేజీలో అవధాని మానేపల్లి నాగకుమారశర్మ అష్టావధానం నిర్వహించారు. కోడూరి ఏకాంబరేశ్వరబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు గర్వకారణమని, తెలుగువారి సొత్తని తెలిపారు. అవధాని అంటే ఎంతో ఏకాగ్రత ఉన్న పండితుడనే అర్థం వస్తుందని వివరించారు. అవధానానికి విశేషమైన భాషా పాండిత్యం, సమయస్ఫూర్తి, కల్పనా చాతుర్యం, చమత్కారం సమపాళ్లలో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అవధాని మానేపల్లి నాగ కుమారశర్మకు చిలకపాటి కృష్ణమాచార్యులు, రంగనాయకమ్మ సాహితీ పురస్కారం–2024 ‘ధారణా ధురీణ’ బిరుదును ప్రదానం చేశారు. అనంతరం రావులకొల్లు వెంకట రంగాచార్యులు వేదాశీస్సులు అందజేశారు.
57
You Might Also Like
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
15
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
13
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడలోని...
స్మార్తంతోనే సమాజ శోభితం
14
స్మార్తంలోని 16 కర్మల ద్వారానే సమాజం నిత్య శోభితమవుతుందని వేద ఘనాపాఠీలు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న...
రాష్ట్ర దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
18
రాష్ట్ర దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం...
సిరిమాను చెట్టుకు బొట్టు
19
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన...
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
25
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా...