News

వైభవంగా యాగంటీశ్వరుడి పల్లకి ఉత్సవం

66views

నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి దేవ స్థానంలో ఉమామహేశ్వర స్వామివార్ల పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహిం చారు. సోమవారం తెల్లవారుజామున ఆలయంలో గణపతి పూజ, స్వామి వార్లకు అభిషేకం తదితర పూజలు చేశారు. సాయంత్రం ప్రదోషకాల ప్రత్యేక పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిం చారు. అనంతరం స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.