ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.
332views
You Might Also Like
మహారాష్ట్రలో కొత్త మత స్వేచ్ఛ చట్టం కింద తొలి కేసు పూణేలో యువకుడు, పాస్టర్పై ఎఫ్ఐఆర్
4
పూణే: మహారాష్ట్రలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2026’ కింద తొలి కేసులు పూణేలో నమోదైనట్లు సమాచారం. మైనర్ బాలికను మతమార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలపై...
బెంగళూరులో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులు
6
బెంగళూరు (కర్ణాటక): అక్రమ వలసదారులపై బెంగళూరు పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ సబ్ డివిజన్ పరిధిలోని 29 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి 1,909...
ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం.. దేశభక్తి చాటిన షోపియాన్ కుటుంబం
35
శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్లోని షోపియాన్లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్...
భారత్ మద్దతు కోరిన బలూచిస్థాన్
31
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య...
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
29
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. 2025 నవంబర్లో...
స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితం : మోహన్ భాగవత్
48
నాగపూర్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో...





