ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.
291views
You Might Also Like
యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్!
40
భారత్ తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి మరియు ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది....
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టం
38
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన...
ఉపరాష్ట్రపతితో ఏబీవీపీ ప్రతినిధుల భేటీ
45
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత...
ప్రజల శక్తితోనే దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది : అంబేకర్
46
భారత ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ఆధారం కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలే కాదని, సామాజిక అవగాహన మరియు ప్రజాస్వామ్య చైతన్యమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార...
బెంగాల్లో మళ్ళీ కదిలిన వందేమాతరం చైతన్యం
డాక్టర్ మన్మోహన్ వైద్య 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1905 - 1911 మధ్య కాలంలో బెంగాల్ చూపించిన చైతన్యాన్ని, పట్టుదలను, జాతీయ భావాన్ని, తిరుగులేని పోరాటాన్ని...
కళ్యాణ్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు ముస్లింలు అరెస్టు!
43
మహారాష్ట్రలోని కళ్యాణ్ (తూర్పు) ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం...





