హిందూ చైతన్య వేదిక, నెల్లూరు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేశ రక్షణ కోసం..ధర్మరక్షణ కోసం..అంటూ నెల్లూరులో శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్ హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ పాఠశాల వరకు యాత్ర సాగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి ద్విచక్ర వాహనాల్లో హనుమాన్ భక్త బృందం ర్యాలీగా తరలి వెళ్లారు. నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర నా భూతో నా భవిష్యత్తుగా 20,000 మంది పై చిలుకు హనుమాన్ భక్తులతో శోభాయమానంగా జరిగింది. అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణ, విచిత్ర వేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక గీతాలాపనలు, బాణసంచా పేలుళ్ల మధ్య హనుమాన్ శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో పాల్లగొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి
నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
79
You Might Also Like
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
12
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. సుప్రీంకోర్టులో పిటిషన్
19
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం...
తిరుపతికి పంపే నెయ్యి వాహనాలకు జీపీఎస్
22
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో లడ్డూల తయారీ కోసం పంపే నందిని నెయ్యి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) నిర్ణయించింది....
శ్రీవారి లడ్డూ పై టీటీడీ కీలక ప్రకటన
21
శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల...
అక్టోబర్ మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు
36
దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు శనివారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ మూడు...