News

కర్ణాటక సంగీతంలో మూడేళ్ల కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించిన మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ

108views

కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సు కోసం తమిళనాడులోని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దరఖాస్తులకు ఈ నెల 25 చివరి తేదీ. ఇంటర్మీడియట్‌ పాసైన 18-30 ఏళ్ల వయసువారు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫారం మ్యూజిక్‌ అకాడమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు బయోడేటా, సంగీతంలో తమ శిక్షణ వివరాలను ఈమెయిల్‌ చేయాలి. జులైలో తరగతులు ప్రారంభమవుతాయి.