News

కాశీ-అయోధ్య రైలు యాత్ర

63views

కాశీ-అయోధ్య రైలు యాత్రను ఈ నెల 21 నుంచి జూలై మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నామని భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ప్రాడక్టు డైరెక్టర్ విగ్నేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో వారణాసి, గయ, ప్రయాగరాజ్, హరిద్వార్, మధుర, అయోధ్య, అమృత్సర్, ఢిల్లీ, ఆగ్రాను సందర్శిం చొచ్చని వివరించారు. భోజనం, బస, బస్సు, టూర్ మేనేజర్, సెక్యూరిటీ వసతులతో కూడిన ప్యాకేజీని నిర్ణయించామని పేర్కొన్నారు. ఏసీ థర్డ్ క్లాస్ ప్రయాణానికి రూ.37,300, స్లీపర్ క్లాస్ రూ.25,200 చార్జి నిర్ణయించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 93550 21516, 93848 03557 నంబర్లలో సంప్రదించాలని కోరారు.