విశాఖపట్నం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు. ఉదయం 7 గంటలకు చందనం చెక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ భాండాగారం వద్ద బేడామడంపంలో 20 మంది సిబ్బంది అరగదీతని శాస్త్రోక్తంగా ప్రాంభించారు. తొలిరోజు 40 కిలోల చందనాన్ని అరగదీశారు. ఈ చందనాన్ని అర్చకులు తూకంవేసి భద్రపరిచారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఏఈవో ఆనంద్కుమార్ పర్యవేక్షించారు. కాగా ఏడాదిలో నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు చందనం సమర్పణ జరుగుతుంది. ఈనెల 10న జరిగిన చందనోత్సవం రోజు తొలివిడత చందన సమర్పణ చేశారు. రెండో విడతగా ఈనెల 23న వైశాఖ పౌర్ణమి రోజు చందనాన్ని సమర్పించనున్నారు.
93
You Might Also Like
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
39
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
42
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
39
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
33
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...
ఫిష్ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర
52
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్...
జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన
32
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు...