
367views
దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని ప్రధానమంత్రి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ప్రజలు ఏకం కావాలని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. మకర సంక్రాంతి నుండి ప్రారంభించి జనవరి 22 వరకు చిన్న పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి సూచించారు.





