
ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలోని హిందువులు, జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం ద్వారా మతప్రచారం చేసే వారికి సనాతన నినాదాలతో సమాధానం చెప్పిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ జై శ్రీరామ్ అని నినాదాలతో వెళ్ళడం మనం చూడవచ్చు.
Gospel blasters given warm 'dharmic' send off by villagers of Kothuru, Tadepalligudem Mandal, AP.
Announcement made from village temple to join in big numbers to make send off a grand success. pic.twitter.com/YcUfLzKrDY— DharmaRakshak (@oldhandhyd) November 1, 2023
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో పలు చోట్ల మతప్రచారం చేసే వారి నుండి హిందువులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విస్తృతమైన మతమార్పిడి కార్యకలాపాల సంఘటనలు తరచుగా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కేశలింగాయపల్లి గ్రామస్థులు తమ గ్రామంలోనికి మతప్రచారకులు ప్రవేశించవద్దని కోరుతూ సైన్ బోర్డును గ్రామ ప్రవేశ ద్వారం వద్ద పెట్టారు.దానికి సంబంధించిన ఫోటోను క్రింద చూడవచ్చు.






