
927views
పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్లో 12 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఏటా వెయ్యిమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. పాకిస్థాన్ మానవహక్కుల నివేదిక ప్రకారమే 2004 నుంచి 2018 వరకు ఒక్క సింధు ప్రాంతంనుంచే ఇలాంటివి 7,430 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారిక సమాచారం మాత్రమే. ఇంకా లెక్కలోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి.







