News

జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది

29views

జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బీజేపీ పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా హజారీబాగ్ లో ఏర్పాటు అయిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ రాష్ట్ర గుర్తింపు, సాంస్కృతిక జానపద కళాత్మక వారసత్వం దెబ్బతినే పరిణామాన్ని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ధ్వజమెత్తారు.

చొరబాటు దార్లను యధేచ్చగా ఇక్కడికి రానిస్తున్నారని, దీనితో క్రమేపీ స్థానికుల జనాభా తగ్గుముఖం పడుతోందని చెబుతూ ఇది ఎంతటి ప్రమాదకరమనేది అందరూ అర్థం చేసుకోవల్సి ఉందని కోరారు. ఇటువంటి వినాశకర శక్తులను తిప్పికొట్టి, తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని పిలుపిచ్చారు. భూమి, బిడ్డ, రొట్టెల పరిరక్షణకు అంతా ఏకం కావల్సి ఉందని పేర్కొన్నారు.