4
హిందూ దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కలెక్టరేట్ ఎదుట విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. మైనార్టీలు తమ సంస్థలు నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నారని హిందువులు దేవాలయాలను సొంతంగా నిర్వహించుకుంటే ఎందుకు అప్పగించరని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ప్రయాగ నరసింహమూర్తి, కోశాధికారి నూలు శ్యామల, భమిడిపాటి కృష్ణమూర్తి, గొవ్వాల నాగరాజు, ఊటుకూరి సాంబయ్య, శిరంగు నాయుడు, పోలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.