News

‘గోవు ఘోషను విను గోవిందా’ కార్యక్రమం

27views

రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ‘గోవు ఘోషను విను గోవిందా’ కింద పేరిట ఆదివారం గోమాత పూజలు చేపట్టనున్నట్లు భాజపా కిసాన్‌మోర్చా ప్రకటించింది. దేవాలయాలను గోపంచకంతో శుద్ధిచేస్తామని అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించి, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినందుకు గోవులు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.