News

కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన

13views

తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది.

‘సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ’ అంటూ తిరుపతిలోని తిరుమల పాలకమండలి భవనం ఎదుట నినాదాలు చేశారు. ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని కోరారు. టీటీడీ ఈవోకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

టీటీడీ ఈవో శ్యామలరావు వారిని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది సాధువులు చర్చలకు వెళ్లారు.గత పాలకమండలికి ఛైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్‌ రెడ్డి, ధర్మారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.