News

తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్‌ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు

11views

తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను సేకరించిన కేంద్రం.. నాణ్యత పరీక్షలో ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు గత శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఆర్‌ ఫుడ్స్‌తోపాటు మరికొన్ని సంస్థలకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది.