News

దుర్గా ఉత్సవాలకు 5 లక్షల కప్పం కట్టండి : హిందువులకు హుకూం

34views

బంగ్లాదేశ్ లో హిందువులపై అక్కడి ఇస్లామిక్ ఛాందసులు రోజు రోజుకీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు హిందువులను చిత్ర హింసలకు గురిచేయడం, దాడులకు దిగడం చేశారు. అంతేకాకుండా నమాజు సమయంలో దుర్గా మండపాల వద్ద సౌండ్ సిస్టమ్ ఆపేయాలని కూడా అక్కడి ప్రభుత్వం హుకూం జారీ చేసింది. తాజాగా అక్కడి ఇస్లామిక్ ఛాందసులు మరో హుకూం జారీ చేశారు. ఈ సంవత్సరం ఎవరైనా దుర్గాదేవి ఉత్సవాలు చేయాలనుకునే వారు తమకు 5 లక్షల రూపాయలు కప్పం కట్టాల్సిందేనంటూ ఇస్లామిక్ ఛాందసులు షరతులు విధించారు. కొందరు కుర్రాళ్లు సైకిల్ మోటారుపై తిరుగుతూ… ఇలాంటి లేఖలు ఇచ్చి మరీ.. వెళ్తున్నారని స్థానిక మండపాల నిర్వాహకులు వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే జిజియా పన్ను లాగే కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి లేఖలు పలు పూజా కమిటీలకు అందాయని తెలిపారు.

తమకు 5 లక్షలు కట్టకుండా ఉత్సవాలు చేసుకోవడం చేస్తే.. తీవ్ర పరిణామాలు వుంటాయని ఇస్లామిక్ ఛాందసులు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల లోపు తమకు చెల్లించాలని, తాము సూచించిన స్థలానికి వచ్చి, చెల్లించాలని డిమాండ్ కూడా పెట్టారు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మండప నిర్వాహకులను భయపెడుతున్నారు. అలాగే 5 లక్షలు కప్పం చెల్లించని పక్షంలో ప్రభుత్వం పక్షాన ఇచ్చే సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేస్తామంటున్నారు. ఆర్మీ కూడా రాకుండా చూస్తామని భయపెడుతున్నారు. వీటితో పాటు తమకు కప్పం చెల్లించకుంటే పూజ కమిటీ సభ్యులను, వారి కుటుంబ సభ్యులను దారుణంగా చంపేస్తామని కూడా లేఖలో హెచ్చరించారు. ఈ పరిణామాలను చూస్తుంటే బంగ్లాదేశ్ లోని హిందువులు ఈసారి దుర్గా నవరాత్రులను సరిగ్గా జరుపుకుంటారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.