News

స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను బంగ్లాదేశ్‌ పరిణామాలు గుర్తుచేస్తున్నాయ్‌

28views

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను మనకు గుర్తుచేస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ‘‘ఒకరి పట్ల ఒకరికి, దేశం పట్ల ప్రజలకు ఉన్న బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుంది. మనకు స్వేచ్ఛ ఎంత విలువైనదో పొరుగునున్న బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాలు స్పష్టంగా గుర్తుచేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నవేళ సీజేఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.