News

కావడి భుజాన పెట్టి.. నగరమంతా చుట్టి..

69views

విశాఖపట్నం నగరంలోని మార్వాడీలంతా కాషాయ వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు తమ కుటుంబ సభ్యులతో మాధవధార శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇక్కడ నిరంతరం ప్రవహించే జలధారను కుండల్లో పట్టుకుని కావడి యాత్రను ప్రారంభించారు. మాధవధార, బిర్లా కూడలి, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, న్యూకాలనీ, తెలుగుతల్లి బ్రిడ్జి, సిరిపురం మీదుగా బీచ్‌ రోడ్డులోని పాండురంగాపురంలోని శివాలయం వరకు శోభాయాత్ర సాగింది. ఈ జలధారతో అక్కడి స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసి యాత్రను ముగించారు.