జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశపు దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయన్నారు. వచ్చే మూడు నెలల్లో స్థానిక పరిస్థితిలో పెను మార్పు కనిపిస్తుందని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘‘ఇటీవలి ఉగ్ర ఘటనలు బాధాకరం. వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం. పొరుగు దేశం దుష్ట పన్నాగాలు విఫలమవుతాయి. ఆ దేశం ఉగ్రవాదానికి నిలయం. ఇక్కడి శాంతిభద్రతలను అస్థిరపర్చేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దించుతోంది. సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది మోహరింపును ముమ్మరం చేశాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యూహాన్ని సమీక్షించారు. రాబోయే రోజుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయి’’ అని మనోజ్ సిన్హా తెలిపారు.
69
You Might Also Like
త్రిపురాంతకేశ్వర ఆలయంలో బయటపడిన.. 14వ శతాబ్దం నాటి శాసనం
46
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ...
నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి
* 500వ జయంతి సందర్భంగా సంస్మరణ - హనుమత్ ప్రసాద్ రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురి మావోయిస్టుల మృతి
42
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-...
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
57
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు....
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి : చంద్రబాబు
36
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘కొండపై గోవింద నామస్మరణ...
నవరాత్రుల సందర్భంగా IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..
39
మీరు నవరాత్రుల సమయంలో ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా IRCTC అద్భుతమైన టూర్...