వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో చేపట్టనున్న నవీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని భారతీయ పురాతత్వ సర్వేక్షణశాఖ రాష్ట్ర పర్యవేక్షకుడు గోపీనాద్ నా శాఖ అదికారులను ఆదేశించారు. రామయ్య క్షేత్రంలో దెబ్బతిన్న విమాన గోపురం, ప్రాకారం గోడలకు మరమ్మతులు చేయాలని రూ.57.48 లక్షలకు పాలనామోదం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాములోరి సన్నిదిలో బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం గర్భగుడి, రంగ మండపంపై నెర్రెలిచ్చిన పైకప్పు, తూర్పు, ఉత్తర, దక్షిణ, విమాన గోపురాలను అధికారులతో కలిసి పరిశీలించారు. చలువరాయి పరిచే పనుల్లో నాణ్యతపై రాజీపవొద్దన్నారు. ఒప్పంద గడువులోగా గుత్తేదారు ద్వారా పనులు వేగవంతంగా పూర్తిచేయించాలన్నారు. విమాన గోపురంపై కొన్ని శిల్పాలు కళాహీనంగా ఉన్నాయని గుర్తించామని, పూర్వాకృతి తీసుకొచ్చేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆధారాలు లభిస్తే శిల్పాలకు నూతన శోభ తీసుకొస్తామని పేర్కొన్నారు. రంగ మండపం, అంకణాల మండపంలో చెబ్బతిన్న రాళ్ల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాటన్నారు. శ్రీవారిపోటులో మరమ్మతులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అమరావతి ఉప పర్యవేక్షకుడు చేమేద్రనాద్ బోయి, ఏఎసీఈ భానుప్రకాష్ వర్మ వైఎస్ఆ్కర్, ప్రకాశం జిల్లాల పురావస్తుశాఖ అధికారులు బాలకృష్ణారెడ్డి, యశ్వంత్కుమార్రెడ్డి, తితిదే డీఈ నాగరాజు తదితరులు. పాల్గొన్నారు.
56
You Might Also Like
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
23
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
19
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...
తిరుమల లడ్డూ వివాదం… అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ
23
కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం...
పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు
21
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు...
మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.....