News

దుర్గాఘాట్‌లో మరిన్ని వసతులు

42views

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాఘాట్‌లో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని ఈవో కె.ఎస్‌.రామరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్‌ను ఈవో రామరావు ఇంజినీరింగ్‌, వైదిక కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఘాట్‌లో సదుపాయాలను పరిశీలించి స్నానఘాట్ల వద్ద పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఘాట్‌లో నిత్యం కృష్ణమ్మ ఇచ్చే పంచహారతులపై ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వసతులపై శ్రీనివాసశాస్త్రి ఆలయ ఈవోకు వివరించారు. ఘాట్‌లో భక్తులకు, పంచహారతులు ఇవ్వడానికి అవసరమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవో వెంట ఈఈ లింగం రమాదేవి, ఏఈలు, ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.