సనాతన ధర్మం పేరు చెప్పుకొని, మోసాలు, కుట్రలు చేసే విషయం మీరట్ వేదికగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్వర్ యాత్ర సందర్భంగా అన్ని హోటళ్లు, ధాబాలు తమ యజమానుల పేర్లు తప్పక ప్రదర్శించాలని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఎందుకు నిబంధన విధించాయో.. ఈ ఘటనతో రుజువవుతోంది. యూపీలోని మీరట్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను హిందువునని చెప్పుకొని, ఓ ముస్లిం వ్యక్తి గోమాతను పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నాడు. ఇలా హిందువు లాగా వేషం ధరించి, గోమాతతో తిరుగుతున్న ముస్లిం వ్యక్తి పేరు నౌషాద్. హిందువులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు.
అతడ్ని పరిశీలించగా.. అతని వద్ద ఓ హిందూ మహిళ ఫొటో, మత్తు మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భిక్షాటన ముసుగులో ఇలాంటి వ్యక్తులు హిందూ ఇళ్లపై దాడులకు దిగుతూ, నేరాలకు పాల్పడుతున్నారని హిందువులు పేర్కొంటున్నారు. ఇలా మోసం చేస్తున్న నౌషాన్ను హిందువులు పోలీసులకు పట్టించారు. అయితే.. ఇతని వద్ద వున్న ఫొటో గురించి ఆరా తీయగా.. ఆమె తన సోదరి అని చెబుతున్నాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.హిందువుల ముసుగులో ఇలాంటి దారుణాలు చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.