News

16న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం

49views

శ్రావణ మాసం రెండో శుక్రవారమైన ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక ఆగస్టు మూడో వారం ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రావణ మాసం విశేషమైన రోజులు, పూజాది కార్యక్రమాలపై ఆలయ ఈవో కేఎస్‌ రామరావు ఆలయ వైదిక కమిటీతో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. శ్రావణ మాసంలో భక్తుల రద్దీని అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు ఇంజినీరింగ్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.