దిల్లీ: బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5వేల కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణశాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీనిని విజయవంతం చేసిన డీఆర్డీవో అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. లక్షిత బాలిస్టిక్ క్షిపణిని సాయంత్రం 4.20 గంటల సమయంలో ప్రయోగించారు. దీనిని భూమి, సముద్రంలో ప్రతిష్టించిన రాడార్ ఆయుధ వ్యవస్థ గుర్తించింది. వెంటనే ఇంటర్సెప్టర్ యాక్టివేట్ అయింది. 4.24 గంటలకు ఫేజ్-2 ఏడీ ఎండో-అట్మాస్ఫియరిక్ క్షిపణిని చాందీపుర్ నుంచి ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగలుగుతుంది.
37
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
105
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
30
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
31
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
29
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
39
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
43
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....