క్రోధం అనే అంతశ్శత్రువు మనల్ని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ మనం నిదానంగానే ఉండాలి. ఆవేశపడితే ఆత్మ నశిస్తుంది- అని హెచ్చరిస్తోంది మహాభారతం. ఎంతటి మహాజ్ఞానులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఉదాహరణకు బ్రహ్మర్షి కావడానికి ముందు విశ్వామిత్రుడు క్షత్రియుడు. తన కోపం కారణంగా ఆయన ఎన్నో కష్టాలు కొనితెచ్చుకున్న ఉదంతాలను పురాణాలు పేర్కొన్నాయి. వశిష్టుడి వద్దనున్న మహిమాన్వితమైన హోమధేనువును తనకు ఇవ్వమని విశ్వామిత్రుడు అడిగితే- నిరాకరించాడు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించి, ఆ గోవును బలవంతంగా తరలించుకుని రమ్మని సైన్యాన్ని పంపాడు. అప్పుడు ఆ హోమధేనువు నుంచి సైన్యం పుట్టుకొచ్చి, విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడించింది. వశిష్టుడి మహిమలకు అతడి తపశ్శక్తే కారణమని గ్రహించాడు విశ్వామిత్రుడు. రాజ్యాన్ని వదిలి తపస్సు ఆరంభించాడు. వశిష్టుడిలా తను కూడా ‘బ్రహ్మ’ అనిపించుకోవాలని తపిస్తుంటాడు. కానీ.. ‘కోపాన్ని త్యజించినవాడే బ్రహ్మర్షి అవుతాడు’ అని వశిష్టుడు వివరించడంతో.. విశ్వామిత్రుడికి జ్ఞానోదయం అయ్యింది. కోపద్వేషాలు లేని నిర్మలమైన ప్రేమే శాంతిని చేకూరుస్తుంది. అందరికీ దగ్గర చేస్తుంది. ప్రేమమూర్తులకు శత్రువులు ఉండరు. అలాంటి అజాత శత్రువులను ఆదరించి, అక్కున చేకూర్చుకుంటారు.
41
You Might Also Like
‘గోవు ఘోషను విను గోవిందా’ కార్యక్రమం
2
రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ‘గోవు ఘోషను విను గోవిందా’ కింద పేరిట ఆదివారం గోమాత పూజలు చేపట్టనున్నట్లు భాజపా కిసాన్మోర్చా ప్రకటించింది. దేవాలయాలను గోపంచకంతో శుద్ధిచేస్తామని అధ్యక్షుడు...
అన్యమతస్థుల కోసం ప్రత్యేక బోర్డులు : టీటీడీ
4
అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక...
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
129
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
42
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
33
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
31
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...