రామభక్త హనుమంతుడిని తలచుకుంటూ హనుమాన్ శోభాయాత్రను ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర రవితేజ కల్యాణ మండపం, పాత సినిమా హాలు మీదుగా సత్రం సెంటర్, మెయిన్ బజార్, చావడి, హిల్రోడ్డు, ఎరుకలసానినగర్, సోమశిల రోడ్డు సెంటర్, ఎల్ఆర్పల్లి, ఆర్టీసీ బస్టాండ్ తిరిగి మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ బస్టాండ్, దళితకాలనీల మీదుగా రవితేజ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసిన హనుమంతుడు, శ్రీరాముడు, సీతారామ, లక్ష్మణ, పట్టాభిషేకం విగ్రహాల అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే సంగీతానికి యువకులు, మహిళలు, చిన్నారులు చేసిన కోలాటం నృత్యం, పండరీ భజన ఆకట్టుకున్నాయి. డీఎస్పీ ఎన్ కోటారెడ్డి, సీఐ జి వేణు, ఎస్సై ముత్యాలరావుతో పాటు వివిధ పోలీసు స్టేషన్ల ఎస్సైలు, పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ చేశారు. శోభాయాత్రను చూసేందుకు పలు సెంటర్ల వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా చూడడం కనిపించింది. శోభాయాత్ర అనంతరం సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు.
47
You Might Also Like
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...
అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం
2
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన...
కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది....
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
20
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...