News

జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు

50views

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆగస్టు 4న సికింద్రాబాద్లో బయలుదేరే ప్రత్యేక రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి 12వ తేదీన తిరుగు ప్రయాణమవు తుంది. అల్పాహారం, టీ, భోజనం, వసతి, రవాణాతో కలిపి టికెటు ధర ఒక్కొక్కరికీ స్లీపర్ తరగతిలో రూ.14,250, థర్డ్ ఏసీలో రూ.21,900, సెకండ్ ఏసీలో రూ.28,450 ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం కలదు. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం ఫోన్ నంబరు 9281030714లో సంప్రదించవచ్చు.