బిహార్లోని బుద్ధగయలో మహాబోధి ఆలయం కింద అపూర్వ పురావస్తు సంపద ఉందని భూతల సర్వేలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్ వారసత్వ వికాస సంఘం, బ్రిటన్లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలసి ఈ అధ్యయనం నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నమైన మహాబోధి ఆలయ కాంప్లెక్స్ బుద్ధుని జీవితంతో ముడిపడిన నాలుగు పుణ్య స్థలాల్లో ఒకటి. బుద్ధగయలోనే గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన బోధి వృక్షం ఉంది. క్రీ.శ 638 నుంచి 645 సంవత్సరం వరకు హర్షవర్థనుడి పాలనలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ బిహార్తో సహా భారత్లో వివిధ బౌద్ధ స్థలాలను సందర్శించారు. మొత్తం 657 బౌద్ధ గ్రంథాలను సేకరించి మాండరిన్ భాషలోకి అనువదించారు. ఆయన రచనల ఆధారంగానే బ్రిటిష్ పురాతత్వవేత్త అలెగ్జాండర్ కనింగ్ హామ్ 1860-70 మధ్య తవ్వకాలు సాగించి నలంద, వైశాలిలను కనుగొన్నారు. ఆ తరవాత మళ్లీ పురావస్తు తవ్వకాలు జరగలేదు. తిరిగి ఇన్నాళ్లకు భూతల సర్వేలు, ఉపగ్రహాల సాయంతో మహా బోధి ఆలయం కింద కప్పబడిన పురాతన కట్టడాల ఆనవాళ్లను కనుగొనగలిగారు.
231
You Might Also Like
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...
అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం
2
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన...
కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది....
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
16
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
60
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....