News

అగ్ని సాక్షిగా.. భగవాన్‌ శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యూపీ యువతి

53views

ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో ఉంటున్న హర్షిక (21) భగవాన్‌ శ్రీకృష్ణుడిని గురువారం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. విగ్రహ రూపంలోని శ్రీకృష్ణునికి ఆమె పూల దండ వేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు.

బంధు, మిత్రులు తరలివచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పసందైన విందు కూడా ఇచ్చారు. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత హర్షికను కారులో బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఆమె చేతితో పట్టుకుని వెళ్లారు.

ఆమె బాల్యం నుంచి శ్రీకృష్ణుడి భక్తురాలు. ఆమె నడుము పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆరేళ్ల వయసు నుంచి ఆమె కర్వా చౌత్‌ సమయంలో ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఆమె తండ్రి పూర్ణ చంద్ర పంత్‌ మాట్లాడుతూ, ఇక శ్రీకృష్ణుడు తమ అల్లుడని, తమ ఇంట్లోనే ఉంటాడని చెప్పారు.