సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే గంగను ఆపగల శక్తి శివుడికి మాత్రమే ఉంది- అనడంతో మహాశివుణ్ణి కూడా తపస్సుతో మెప్పించాడు భగీరథుడు. పరమశివుడి అనుగ్రహంతో సర్వలోకాలకు పూజ్యురాలైన గంగ ఆకాశం నుంచి శివుడి శిరస్సుపైకి దూకింది. ధరింప శక్యం కాని గంగాదేవి తన ఉధ]ృత ప్రవాహంతో శంకరుణ్ణి పాతాళానికి తీసుకు వెళ్దామనుకుంది. అది గ్రహించిన శంకరుడు- గంగమ్మ గర్వాన్ని అణచి వేయాలనుకున్నాడు. హిమవత్ పర్వతంతో సమానమైంది, జటా మండలం అనే గుహలతో నిండి ఉన్నది అయిన శివుడి శిరస్సు చేరిన గంగ.. ఎంత ప్రయత్నించినా అక్కడ నుంచి భూమి మీదికి వెళ్లలేక శివుని జటాజూటంలోనే బందీ అయ్యింది. దీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గంగాదేవి ఉనికిని తెలుసుకోలేక మళ్లీ శివుడి కోసం తపస్సు చేశాడు భగీరథుడు. అప్పుడు కరుణించిన శివుడు గంగను హిమవత్పర్వతం మీద ఉన్న బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడిచిపెట్టాడు. ఆ గంగా ప్రవాహం 7 పాయలుగా మారింది. హ్లాదిని, పావని, నళిని అనే 3 గంగలు తూర్పుదిశగా, సుచక్షువు, సీత, సింధువు అనే 3 మహా నదులు పశ్చిమదిశగా ప్రవహించాయి. ఏడోదైన గంగ.. భగీరథ మహారాజు దివ్య రథం అధిరోహించి ముందు వెళ్తుండగా అతణ్ణి అనుసరించింది. ఆ ఏడు పాయల జలాలతో తన ముత్తాతలకు స్వర్గప్రాప్తి కలిగించాడు భగీరథుడు.
106
You Might Also Like
తిరుమల లడ్డూ వివాదం… అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ
కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం...
పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు...
మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.....
11 చోట్ల ఎన్ఐఏ దాడులు
24
భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర పన్నుతున్న హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనే ఛాందసవాద సంస్థపై NIA చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో నిషేధించబడింది. ఈ...
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
23
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...