News

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

75views

శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల పోటెత్తారు.వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పైగా ఆదివారం కావటంతో క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం క్యూలైన్స్ లో బారులు తీరారు.

శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.అయితే భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.