News

అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. సీఎస్ కీలక ప్రకటన

69views

అమరావతి రాజధాని రైతులకు ఏపీ సీఎస్ గుడ్ న్యూస్ తెలిపారు. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు గెలవడంతో రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలపైగానే భూములిచ్చారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అవగానే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. రాజధాని భూములను అభివృద్ధి చేయలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే వరకూ సైతం నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతం కళకళలాడుతోంది. అటు ప్రభుత్వం కూడా రాజధానిని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది.

దీంతో రాజధాని రైతులకు సీఎస్ నీరబ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయని చెప్పారు. ఉద్దండరాయుని పాలెం దగ్గర రాజధాని కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు చేస్తున్నామన్నారు. సీఎంగా చంద్రబాబు, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో 25 ప్రాంతాలను గుర్తించామని, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు.