ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.
74
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
90
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
30
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
29
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
27
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
37
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
40
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....