News

శ్రీశైలం మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు

80views

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గత 28 రోజులలో భక్తులు స్వామి, అమ్మవార్లకు, ఉప ఆలయాలకు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ(Hundi) కి రూ. 4.04 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

హుండీ లెక్కింపులో నగదుతో పాటు 332 . 500 మిల్లీ గ్రాముల బంగారం, 5.760 గ్రాముల వెండి వచ్చిందని తెలిపారు. 1768 యుఎస్ఏ డాలర్లు, ఒకటి ఖత్తార్ రియాల్, 45 యుఏఈ దిర్హమ్స్, 5 కెనడా డాలర్లు, 10 యూరోస్, 50 యుకె ఫౌండ్స్ , 55 ఆస్ట్రేలియా డాలర్లు, ఒక మలేషియా రింగిట్స్, 109 సింగపూర్ డాలర్లు, వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఈవో వెల్లడించారు