పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు క్షిపణి రహస్యాలను చేరవేసిన కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు జీవిత ఖైదు పడింది. దాంతోపాటు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాగపూర్ జిల్లా కోర్టు జడ్జి ఎంవీ దేశ్పాండే సోమవారం తీర్పునిచ్చారు. డీఆర్డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్ కన్సార్షం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిశాంత్ అగర్వాల్ 2014 నుంచి ఆ సంస్థలోని సాంకేతిక విభాగంలో పనిచేశాడు. అతను బ్రహ్మోస్కు చెందిన రహస్యాలను ఐఎస్ఐకు చేరవేసినట్లు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. 2018లో మిలటరీ ఇంటెలిజెన్స్తోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందాలు(ఏటీఎస్) సంయుక్త ఆపరేషన్ నిర్వహించి, నిశాంత్ను అరెస్టు చేశాయి. సీఆర్పీసీతోపాటు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఎఫ్), అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో అతనికి నాగపూర్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి వాజాని వాదనలను వినిపించారు. పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి ఎంవీ దేశ్పాండే.. దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించిన ఆధారాలు, వాదనలతో ఏకీభవిస్తూ.. సోమవారం తుది తీర్పును వెలువరించారు. నిశాంత్కు జీవిత ఖైదుతోపాటు.. 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 3 వేల జరిమానా విధించారు.
88
You Might Also Like
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
19
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...
సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
17
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం...
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
12
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,...
హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్పీ
27
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్...
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
32
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...