గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా మాల్దీవుల మంత్రి మండలి నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసింది. భారత్లోని బీచుల్లో పర్యటించండని తమ దేశ పౌరులకు సూచించింది. ‘‘ఇజ్రాయెల్ పర్యటకులపై మాల్దీవులు నిషేధం విధించాలని యోచిస్తోన్న తరుణంలో.. భారత్లోని కొన్ని బీచ్ల వివరాలు మీకోసం. వాటి వద్ద మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుంది. అద్భుతమైన ఆతిథ్యం ఉంటుంది. మన దౌత్యవేత్తలు చేసిన పర్యటనల ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాం’’ అంటూ ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం స్పందించింది. లక్షద్వీప్, గోవా, అండమాన్, నికోబార్ దీవులు, కేరళలోని బీచ్ల ఫొటోలను షేర్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి షొషాని మరో పోస్టు పెట్టారు. దానికి జనవరిలో మోదీ లక్షద్వీప్ పర్యటన ఫొటోలను జత చేశారు. ‘‘మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రజలు భారత్లోని అందమైన బీచ్ల్లో పర్యటిస్తారు’’ అని పేర్కొన్నారు.
111
You Might Also Like
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
37
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...
సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
36
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం...
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
27
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,...
హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్పీ
35
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్...
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
36
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...