News

దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ

89views

దేశాభివృద్ధి కోసం కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ పురోగతి ప్రతి ఒక్కరినీ గర్వంతో, కీర్తితో నింపుతుందని పేర్కొన్నారు.

“ప్రజాస్వామ్యంలో అతిపెద్దదైన ఓట్ల పండుగ ముగిసింది. కన్యాకుమారిలో మూడు రోజుల పర్యటన ముగించుకుని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యాను. ఇక ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా గొప్ప కర్తవ్యాలు, లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. కొత్త కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవాలి. ఆ కలల్లో జీవించడం ప్రారంభించాలి. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధిని చెందాలి. 21వ శతాబ్దపు ప్రపంచం అనేక ఆశలతో భారత్ వైపు చూస్తోంది. సంస్కరణల ఆలోచనలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సంస్కరణలు 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. అందుకే నేను దేశం కోసం సంస్కరణ, పనితీరు, పరివర్తన దృక్పథాన్ని నిర్దేశించాను. సంస్కరణ బాధ్యత నాయకత్వంపై ఉంది. దాని ప్రకారమే అధికార యంత్రాంగం నడుచుకుంటుంది. నా మనసులో చాలా అనుభవాలు, భావోద్వేగాలు నిండి ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు అమృత్‌కాల్‌లో మొదటివి. ఎన్నికల ఉత్సాహం నా గుండెల్లో, మనసులో ప్రతిధ్వనించడం సహజమే. మహిళా లోకం నుంచి నాకు వచ్చిన ఆశీర్వాదాలు, నమ్మకం, ఆప్యాయత ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నేను ‘సాధన’లోకి ప్రవేశించాను. ఆపై రాజకీయ చర్చలు , దాడులు, ప్రతిదాడులు, ఆరోపణలు.. ఇవన్నీ శూన్యంగా మారాయి. నా మనస్సు పూర్తిగా బాహ్య ప్రపంచం నుంచి విడిపోయింది” అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.