85
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక సింగపూర్లోని షాంగీ నేవల్ బేస్కు చేరింది. అక్కడ క్రంజి యుద్ధస్మారక స్తూపం వద్ద నౌక సిబ్బంది, భారత హైకమిషనర్ కలిసి అమరులకు నివాళులు అర్పించారు. నౌకను ఆదేశ పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. గస్తీ అనంతరం జపాన్-ఇండియా మారిటైం విన్యాసాలకు భారత నేవీ నౌక, సిబ్బంది బయలుదేరి వెళ్లనున్నారని తెలిపాయి.