సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి, సంస్థ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు సాధు ప్రసాద్ తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సేవాభారతి విజయవాడ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. సేవా కార్యక్రమాలను నిత్యం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి విజయవాడ ప్రతినిధులను ప్రోత్సాహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అవార్డును అందించింది. “సేవా హి పరమో ధర్మః”(సేవే ప్రధాన ధర్మం) అనే నినాదంతో గత మూడు దశాబ్దాలుగా నిరుపేద కార్మికుల విద్య, వైద్యం వంటి రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా సేవాభారతి, విజయవాడ కృషి చేస్తోందని అవార్డు అందుకున్న సంస్థ కోశాధికారి తెలియజేశారు. నిరుపేద చిన్నారులకు పాఠశాల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో నైతిక, శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు.
320views
You Might Also Like
ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్
33
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్పూర్లోని తేరాపంథ్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి...
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
35
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ,...
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
40
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ...
ధర్మవరంలో జగన్నాథ రథయాత్ర
39
ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ...
పౌరసత్వానికి భూమి పత్రాలు ఆధారం కాదని కలకత్తా హైకోర్టు తీర్పు
42
పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేవలం భూమి లేదా ఆస్తి పత్రాలు మాత్రమే సరిపోవని కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధమైన చొరబాటు ఆరోపణల ఉన్నప్పుడు ఇలాంటి పత్రాలకు...
సంస్కృత భాషలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
46
తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్...





