కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
323views
You Might Also Like
ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం.. దేశభక్తి చాటిన షోపియాన్ కుటుంబం
27
శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్లోని షోపియాన్లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్...
భారత్ మద్దతు కోరిన బలూచిస్థాన్
27
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య...
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
25
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. 2025 నవంబర్లో...
స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితం : మోహన్ భాగవత్
29
నాగపూర్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో...
తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ కామెంట్స్
47
చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. ‘‘తమిళ భాషను ఎంతగా...
ప్రకృతి శక్తిని ఉపయోగించుకున్న రైతు సాంకేతికత
విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా వాగులో ప్రవహించే నీటిని కొండపై ఉన్న పొలాలకు తరలించవచ్చా? సాధ్యమేనని నిరూపిస్తున్నారు గ్రామీణ ఆవిష్కర్త శ్రీనివాస్. నీటి...





