కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
269views
You Might Also Like
సెప్టెంబర్ దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ
33
సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం -TTD...
పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
34
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్డిఎ ప్రభుత్వం అడ్డుకుంటుందని...
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
31
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా...
భారతీయతలో ఆధునిక సవాళ్లకు పరిష్కారాలు : భాగవత్
39
సనాతన ధర్మం భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అభివర్ణించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతీయ నాగరికతా దృక్పథమే...
భారతదేశపు గొప్ప జ్ఞాన సంప్రదాయాల ద్వారా శాస్త్రీయ జ్ఞానం వ్యాప్తి
41
బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి' ఏడో జాతీయ సదస్సు జరిగింది. సైన్స్ సెంటర్ (BHU), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BHU) మరియు ఇంటర్-యూనివర్సిటీ సెంటర్...
సింహాచలం క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక
29
సనాతన ధర్మ సంప్రదాయాలకు, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు...





