కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
249views
You Might Also Like
పూర్వీకుల భారతీయ మూలాల పట్ల ప్రగాఢమైన గర్వం
35
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు....
పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ రక్షణ ప్రాజెక్టుకు శంకుస్థాపన
28
ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే...
భోజ్శాల ఆలయం హిందువులదే: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
39
దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల వివాదంలో అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య...
భారతీయ జీవన విధానంపై రష్యన్ మహిళ ప్రశంసలు
35
మోహాలిలో నివసిస్తున్న సోఫియా అనే రష్యన్ మహిళ, భారతీయ మహిళల నుంచి తాను అలవర్చుకున్న ఐదు మంచి అలవాట్లను వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్...
నిదాఖాన్కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత
39
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు....
అనంతపురంలో రాష్ట్ర సేవికా సమితి “పథ సంచలన్”
139
అనంతపురం నగరంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ కార్యక్రమాల సందర్భంగా గురువారం (14-05-2026) “పథ సంచలన్” నిర్వహించబడింది. సంప్రదాయ...





