News

పురావస్తుశాఖ స్థలంలో శాశ్వత నిర్మాణాలొద్దు

83views

పురవాస్తు శాఖ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు చేపట్టవద్దని ఆ శాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఆర్‌.ఫల్గుణరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా దీర్గాశిలో శిలా శాసనం పరిసరాలను పరిశీలించారు. సమీపంలోని దుర్గాగిరి అమ్మవారి ఆలయ సమీపంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతు న్నట్లు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో పరిశీలనకు వచ్చామన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. కొత్త నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. దాత లు విరాళాలు అందచేస్తే నగదు రూపంలోనే ఉంచాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఇదిలా ఉండగా దీర్గాశి శిలాశాసన సమీపంలో పురావస్తు శాఖ పరిధిలో సుమారు 11 ఎకరాల విస్తీర్ణం భూములున్నాయని ఏడీ చెప్పగా ఆ స్థలాన్ని రెవెన్యూశాఖ ద్వారా కొలతలు వేసి అప్పగించాలని గ్రామస్థులు సూచించారు.