News

నారసింహుడి వసంతోత్సవం

76views

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు గుండూరావు, బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం అర్చకులు ఒకరిపై ఒకరు వసంతాలను

చల్లుకున్నారు. సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. కార్యక్రమానికి రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమిద్యాలకు చెందిన సుగుణపతి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవో విజయ్‌ కుమార్‌ పర్యవేక్షించారు.