98
భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్ ఆఫ్ వార్’లో భారత జవాన్లు విజయం సాధించారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధ్రువీకరించాయి.
https://x.com/i/status/1795652091714867221
‘ఐక్యరాజ్య సమితి పీస్కీపింగ్ మిషన్’లో భాగంగా భారత్కు చెందిన కొంత మంది సైనికులు సూడాన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా ‘టగ్ ఆఫ్ వార్’ ఆటను నిర్వహించగా మనవాళ్లు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు.