పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను పదో తరగతికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాన్సి ప్రస్తావించారు. ప్రతిఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు (సమరం) కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ వేడుకకు సంబంధించిన చరిత్రను తాజాగా పదోతరగతి తెలుగు వాచకంలో పొందు పరిచారు. భక్తులు, కర్రలు ఎందుకు తీసుకువస్తారు…? పండుగ ప్రత్యేకత, గుడి వద్ద పూజారులు వినిపించే భవిష్యవాణి, వసంతోత్సవం రోజున దేవరగట్టులో గోరవయ్యలు ఇనుప గొలుసు తెంపడం వంటి అంశాలను పా ఠ్యాంశంలో చేర్చారు. ప్రాచీన సం ప్రదాయ పండుగ దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ చరిత్ర, బన్నీ జైత్ర యాత్రపై తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ప్రచురిం చడం అభినందనీయమని తెలుగు కవయిత్రి, ఉపాధ్యాయురాలు బత్తిన మహాదేవి అన్నారు.
81
You Might Also Like
ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం
కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని...
అరుణాచల్ సరిహద్దుల్లో ఓ శిఖరానికి పేరు పెట్టిన భారత్
19
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ...
తిరుపతిలో తెలుగు భాషా సభలు
24
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం-ప్రాచ్య పరిశోధనా సంస్థ(ఓఆర్ఐ) - తెలుగు సంపద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా సభలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో...
శ్రీకాకుళంలో ‘గోవు ఘోష విను గోవిందా’
19
బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో 'గోవు ఘోష విను గోవిందా' అంటూ గోమాతతో చారిత్రక...
అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు
19
హిమాచల్ ప్రదేశ్లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్పూర్లో నిరసన ర్యాలీ...
దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
24
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నమని పోలీస్ కమిషనర్ ఎస్వీ...