635
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
సోహెల్ ఎస్బీఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం అతడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.